హైదరాబాద్: హైదరాబాద్లోని (Hyderabad) పాతబస్తీలో (Old city) ఉన్న మీర్చౌక్లో (Meer Chowk) అర్ధరాత్రి కాల్పులు కలకలం (Gun fire) సృష్టించాయి. ఇంటి కొనుగోలు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో మసూద్ అలీ అనే న్యాయవాది (Advocate Masud Ali) గాలిలోకి కాల్పులు జరిపాడు. అర్ఫాత్ అనే వ్యక్తి కొన్నిరోజుల క్రితం ఓ ఇంటిని కొనుగోలు చేశారు. అయితే దానికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. ఆ ఇంటిపై కోర్టులో కేసు ఉండగా ఎలా కొంటారని పక్కింటి వారు గొడవకు దిగారు. ఇదే వ్యవహారంలో ఇరువర్గాలు పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. కోర్టుకు కూడా వెళ్లారు. అయితే గత శనివారం మరోసారి మీర్చౌక్ పోలీస్ స్టేషన్లో అర్ఫాత్ కేసుపెట్టారు.
దీంతో శనివారం అర్ధరాత్రి మసూద్ అలీ అనే న్యాయవాది అర్ఫత్తో గొడవకు దిగారు. వారిని భయపెట్టడానికి తన వద్ద ఉన్న తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈక్రమంలో ఇరువర్గాలకు చెందినవారు రాళ్లు.. కర్రలతో దాడులుచేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.