కుత్బుల్లాపూర్, డిసెంబర్ 1 : పరిపాలన అంశాలను సమర్థవంతంగా కొనసాగించాలని మేడ్చల్ జిల్లా అదన పు కలెక్టర్ అభిషేక్ అగస్త్య కొంపల్లి మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు. గురువారం కొంపల్లి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి నిర్మాణాలతో పాటు సమస్యలపై సందర్శించి.. పరిశీలించారు. కొంపల్లి బ్రిడ్జి నుంచి సు చిత్ర చౌరస్తా వరకు సాగుతున్న ఎన్హెచ్-44 జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. నిర్మాణ పనుల్లో ఏమాత్రం అలసత్వం వహించరాదని, దీనికితోడు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణాలు సాఫీగా సాగేలా తగు చర్యలు తీసుకోవాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులకు పలు సూచన లు ఇచ్చారు.
అనంతరం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో శానిటేషన్తో పాటు ఇతర సమస్యలను పరిశీలించి, మ రింత మెరుగ్గా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్ శ్రీహరికి సూచించారు. దూలపల్లి ఫారెస్టు అకాడమీకి సంబంధించిన రెండెకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం కోసం నివేదికలను తయారు చేయాలని, దీంతో పాటు దూలపల్లి శ్మశానవాటిక అభివృద్ధి కి మరో టెండర్ కోసం ప్రణాళికలను సిద్ధం చేయాలని సూ చించారు. అనంతరం స్థానిక కార్యాలయంలో చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్, వైస్ చైర్మన్ రత్లావత్ గంగయ్యనేతృత్వంలో అదనపు కలెక్టర్ను సన్మానించి మొక్కను అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కార్యాలయం ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.