హైదరాబాద్ : పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆధర్ సిన్హా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు ఆయన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి ఆధర్ సిన్హాను మంత్రి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
అదేవిధంగా గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి శుభాకాంక్షలు తెలిపారు.