సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 7 అంశాలకు కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. స్టాండింగ్ కమిటీ సభ్యులు శాంతి సాయిజెన్ శేఖర్, సయ్యద్ సోహెల్ ఖాద్రీ, సమీనా బేగం, అబ్దుల్ వాహెబ్, మహ్మద్ అబ్దుల్ ముక్తర్, మహ్మద్ మాజీద్ హుస్సేన్, మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్, బండారి రాజ్కుమార్, వనం సంగీత యాదవ్, రాగం నరేందర్ యాదవ్, సతీశ్ బాబు పండాల, ఈఎస్ రాజ్ జితేంద్రనాథ్, ఆర్.సునీత, టి.మహేశ్వరీ పాల్గొని ఏడు అంశాలపై చర్చించి ఆమోదించారు. ఈ సమావేశంలో కమిషనర్ రోనాల్డ్ రోస్, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, అడిషనల్ కమిషనర్లు స్నేహ శబరీష్, యాదగిరి రావు, సరోజ, జయరాజ్ కెనడి, గీతా రాధిక, ఉపేందర్ రెడ్డి, సీసీపీ రాజేంద్ర ప్రసాద్ నాయక్, సీఈ దేవానంద్, అకౌంట్స్ ఎగ్జామిషనర్ వెంకటేశ్వర్లు, చీఫ్ ఎంటమాలజీ డాక్టర్ రాంబాబు, జోనల్ కమిషనర్ వెంకటేశ్ దోంత్రె, రవికిరణ్, పంకజ, శ్రీనివాస్ రెడ్డి, మమత, వెంకన్న, సెక్రటరీ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
స్టాండింగ్ కమిటీ తీర్మానాలు