వ్యవసాయ యూనివర్సిటీ, ఏప్రిల్ 7: ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ అగ్రి కళాశాలలో మంగళవారం సాయంత్రం అసోషియేట్ డీన్ గోవర్ధన్ రూ.లక్ష నగదుతో పట్టుబడ్డట్లు హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ తెలిపారు. గత ఏడాది ఓ సీడ్ కంపెనీ పర్మిషన్కు గోవర్దన్ను సంప్రదించగా 1.25లక్షలు డిమాండ్ చేశారు. అడ్వాన్స్గా రూ.25వేలు, అనంతరం రూ.లక్ష ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది.
సీడ్స్ కంపెనీకి పర్మిషన్ వచ్చింది, మిగతా డబ్బులు ఇవ్వాలని పదేపదే ఫోన్లో వేధించడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. రూ.లక్ష నగదుతో కళాశాలలోని తన చాంబర్లో తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. గోవర్ధన్ కుటుంబసభ్యుల పేర ఓ కంపెనీ ఉందని, అలా తమకు పరిచయాలున్నాయని బాధిత సభ్యులతో నమ్మబలికారు. వీసీ జానయ్యకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఎల్బీనరగ్ గోవర్ధన్ స్వంత ఇంట్లో కూడా ఏక కాలంలో ఏసీబీ సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది.