AAP | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఏ పాత్ర లేని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేయడం దుర్మార్గమని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ మండిపడ్డారు. ఈ మేరకు కేజ్రీవాల్ అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పా ర్టీ శ్రేణులతో కలిసి ఆయన నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు.
‘మోదీ హఠావో..దేశ్కో బచావో’.. ‘బీజేపీ డౌన్..డౌన్’ వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. అనంతరం బారికేడ్లను తోసుకుంటూ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా, తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆప్ శ్రేణులను అరెస్టు చేశారు.
-సుల్తాన్ బజార్, మార్చి 22