సిటీబ్యూరో, మే 2 (నమస్తే తెలంగాణ) : జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2023లో నగరంలోని ఆకాశ్ బైజూస్ సంస్థలకు చెందిన 32 మంది విద్యార్థులు 99శాతం పైన సాధించారు. ఆ విద్యా సంస్థల్లో గుంజి మణిదీప్, పూర్వి సడగోపస్ 99.96, ఎస్.సిద్ధార్థ్ 99.95, బి.సిద్ధార్థ్ 99.94, లోహిత్ కుమార్ 99.90 శాతం సాధించి తల్లిదండ్రులకు, ఇనిస్టిట్యూట్కు గర్వకారణంగా నిలిచారని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా బైజూస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అభిషేక్ మహేశ్వరి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.