హైదరాబాద్ : దిల్సుఖ్నగర్(Dilsukhnagar)లో యువకుడిపై హత్యాయత్నం(Attacked )స్థానికంగా కలకలం రేపింది. తోటి స్నేహితుడిని మద్యం సీసాల(Liquor bottle)తో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కోణార్క్ థియేటర్ వద్ద మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నివాస్, జమీల్ ఇద్దరు స్నేహితులు. ఇద్దరు కలిసి మద్యం తాగారు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్వల్ప వివాదం జరిగినట్లు తెలిసింది. కోపంతో జమీల్ సీసాను పగులకొట్టి శరీరంలోని వివిధ భాగాల్లో దాడి చేశాడు. తప్పించుకుని వచ్చిన శ్రీనివాస్ చర్మాస్ వద్ద పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.