హైదరాబాద్ : బిడ్డను మంచిగా చదివించాలని తల్లిదండ్రుల తాపత్రయం.. కానీ ఆమెకేమో ఫ్రెండ్స్తో కాలక్షేపం చేయడం ఇష్టం. తమ మాట కూతురు వినట్లేదని మానసికంగా కుంగిపోయిన ఓ తల్లి.. చేసేదేమీ లేక తనువు చాలించింది. ఈ విషాద ఘటన హైదరాబాద్లోని నారాయణగూడలో చోటు చేసుకుంది.
ముత్యాలబాగ్లోని ఆర్టీసీ గెస్ట్ హౌస్ సమీపంలో ఇద్దరు దంపతులు తమ కుమార్తెతో కలిసి ఉంటున్నారు. కూతురు డిగ్రీ చదువుతోంది. తల్లిదండ్రులేమో కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే కూతురు చదువును పక్కనపెట్టి స్నేహితులతో కాలక్షేపం చేయడం మొదలుపెట్టింది. గంటల తరబడి ఫోన్లు మాట్లాడుతూనే ఉంది. వీటన్నింటిని పసిగట్టిని తల్లి.. కూతురిని మందలించింది. బుద్ధిగా చదువుకోవాలని, స్నేహితులను దూరం పెట్టాలని ఆమెకు తల్లి సూచించింది. అయినప్పటికీ బిడ్డ ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న నారాయణగూడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.