Hyderabad | బంజారాహిల్స్, మే 29 : మత్తుమందు ఇచ్చి మహిళపై లైంగికదాడికి పాల్పడడంతో పాటు బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం 7లో నివాసం ఉంటున్న మహేంద్ర వర్థన్ అనే వ్యక్తికి రెండేళ్ల క్రితం ఫేస్బుల్లో మహిళ (30)తో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ ఉస్మానియా యూనివర్సిటీలో కలుసుకున్నారు. అప్పటినుంచి వారిమధ్య స్నేహం ప్రారంభమయింది.
కాగా ఏడాదిన్నర క్రితం తన ఇంటికి భోజనానికి పిలిచిన మహేంద్రవర్థన్ ఆమెకు మత్తుమందు ఇచ్చాడు. మహిళ మత్తులోకి జారుకున్న తర్వాత లైంగికదాడికి పాల్పడడంతో పాటు వీడియో, ఫోటోలు తీసుకున్నాడు. అప్పటినుంచి ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు గుంజుతున్నాడు. ఇప్పటివరకు రూ.20లక్షలు వసూలు చేసిన మహేంద్రవర్థన్ తనకు రూ.1 కోటి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. దీంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా బీఎన్ఎస్ 64(1),308(2),351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.