హైదరాబాద్ : గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. కొండాపూర్ మైహోమ్ మంగళ వద్ద కారు ప్రమాదానికి గురైంది. ఈ కారులో ప్రయాణిస్తున్న ఓ యువతి ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే మద్యం మత్తులో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని పోలీసులు భావిస్తున్నారు. కారు నడిపిన వ్యక్తిని అభిషేక్గా పోలీసులు గుర్తించారు. మృతురాలు ఆశ్రిత కెనడాలో ఎంటెక్ చదువుతున్నట్లు తెలిసింది.