HomeHyderabadA Woman Caught With Packets Of Marijuana Is Another Absconder
ఒడిశా నుంచి మహారాష్ట్రకు..
ఒడిశా నుంచి మహారాష్ట్రకు రైలులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ మహిళను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. 46 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
మారేడ్పల్లి, జనవరి 18: ఒడిశా నుంచి మహారాష్ట్రకు రైలులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ మహిళను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. 46 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఒడిశాకు చెందిన శిల్పానాయక్..అక్కడి మోహన ప్రాంతానికి రాజీవ్ నాయక్తో కలిసి ఈ నెల 16న అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి వద్ద 46 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. పలాస స్టేషన్లో ఫలక్నుమా రైలు ఎక్కారు. 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ముంబైకి వెళ్లేందుకు దేవగిరి ఎక్స్ప్రెస్ కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో రాజీవ్ నాయక్ భోజనం చేసి వస్తానంటూ.. వెళ్లిపోగా, శిల్పానాయక్ అనుమానాస్పదంగా కనిపించడంతో రైల్వే పోలీసులు ఆమె వద్ద ఉన్న బ్యాగ్లను తనిఖీ చేశారు. గంజాయి ప్యాకెట్లు గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. రాజీవ్ నాయక్ పరారీలో ఉన్నాడు.