చర్లపల్లి, జూన్ 29 : గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కొని రెండేండ్ల బాలుడు మృతి చెందిన సంఘటన చర్లపల్లిలో చోటు చేసుకున్నది. బాధితులు, స్థానికుల కథనం ప్రకారం.. చర్లపల్లి డివిజన్ సోనియాగాంధీనగర్లో నివాసముండే అరెపల్లి శ్రీనివాస్, భార్య త్రివేణి తన ముగ్గురు పిల్లలతో కలిసి స్థానికంగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
కాగా చిన్న కుమారుడు జశ్వంత్(02)ఇంట్లో ఆడుకుంటూ కొబ్బరి ముక్కను నోట్లో పెట్టుకోగా గొంతులో ఇరుక్కుపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వైద్యశాలకు తరలించారు. అప్పటికే బాలుడు మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.