కులకచర్ల, జనవరి 26 : జెండావిష్కరణకు వెళ్తున్న ఓ ఉపాధ్యాయుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంఘటన రామచంద్రాపురం వద్ద చోటు చేసుకున్నది. నగరంలోని జిల్లెలగూడ ఉన్నత పాఠశాలలో ఎస్ఏ ఉపాధ్యాయుడిగా పనిచేస్తు-న్న కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి శుక్రవారం ఉదయం బండవెల్కిచర్ల గ్రామం నుంచి జెండావిష్కరణ కార్యక్రమానికి బైక్పై బయలుదేరాడు.
కొందుర్గు మండలం రామచంద్రాపురం వద్దకు చేరుకోగానే రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. విషయం తెలుసుకున్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి దంపతులు బండవెల్కిచర్లకు చేరుకొని భౌతిక కాయానికి నివాళులర్పించారు.