శంషాబాద్ రూరల్, జూలై 9 : రోడ్డు దాటేందుకు వేచి ఉన్న వారిపైకి అతివేగంగా వాహనం దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాతంరాయి గ్రామానికి చెంది న సుమ(55), చిలకమర్రి సువర్ణ(65) కూలీ పనికి వెళ్లి.. ఇంటికి వెళ్లేందుకు గురువారం ఉద యం స్థానిక బస్టాండ్ వద్ద రోడ్డు దాటేందుకు వేచి ఉన్నారు.
ఇంత లో కర్ణాటక నుంచి మిర్చిలోడ్తో వస్తున్న వాహనం అతివేగంగా వచ్చి ముందుగా వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి బస్టాండ్లోకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో సుమ, సువర్ణ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.