సుల్తాన్బజార్,మే 23 : ప్రమాదాల్లో గాయపడిన వారికి సరైన సమయంలో చర్మం అందుబాటులో లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దుస్థిని అరికట్టేందుకు ఉస్మానియా ప్లాస్టిక్ సర్జరీ విభాగం మాజీ హెచ్వోడీ డాక్టర్ నాగప్రసాద్ 2016లో దవాఖానలో స్కిన్ బ్యాంకు ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు. అతడి చొరవతో రాష్ట్రంలో మొదటిసారిగా ఉస్మానియాలో ఏర్పాటు చేసిన ఈ స్కిన్ బ్యాంకు రోగుల ప్రాణాలను కాపాడుతూ విజయవంతంగా కొనసాగుతున్నది.
జీవన్దాన్ తరహాలో..
సాధారణంగా బ్రెయిన్డెడ్ అయిన వారి వద్ద జీవన్దాన్లో భాగంగా కళ్లు, కిడ్నీ, మిగతా అవయవాలు సేకరిస్తుంటారు. ఇదే తరహాలోనే దానం ఇచ్చే వారి అంగీకారంతో చనిపోయిన ఆరు గంటలలోపు చర్మాన్ని సేకరించడం జరుగుతున్నది. సేకరించిన చర్మాన్ని 4 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో సుమారు 5 సంవత్స రాల పాటు స్కిన్ బ్యాంకులో నిల్వ ఉంచవచ్చని వైద్యులు చెబుతున్నారు.
10 మంది నుంచి చర్మ సేకరణ..
ఉస్మానియా దవాఖానలో 2021లో ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు చనిపోయిన 10 మంది కుటుంబ సభ్యుల అంగీకారంతో సేకరించిన చర్మాన్ని 16 మంది క్షతగాత్రులకు స్కిన్ గ్రాఫ్టింగ్ పద్ధతిలో ఉపయోగించారు. ప్రస్తుతం స్కిన్ బ్యాంకులో 11 వేల 768 చదరపు సెంటీ మీటర్ల చర్మం అందుబా టులో ఉందని పా ్లస్టిక్ సర్జరీ విభాగం హెచ్వోడీ డాక్టర్ నాగప్రసాద్ తెలిపారు. అందుబాటులో ఉన్న చర్మంతో 30 మంది క్షతగాత్రులకు చర్మం అతికించే అవకాశం ఉంది. 0 pt
ఆధునిక యంత్రాలతో..
ఉస్మానియా దవాఖానలోని ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో ఏర్పాటయ్యే స్కిన్ బ్యాంకులో వాల్క్ కోల్డేజ్ స్టోర్ రూం, షేకింగ్ ఇంక్యుబేటర్, కూలింగ్ ఇంక్యుబెటర్, సీలర్, డర్మెటామ్ మిషన్, మెషర్, బయోసేఫ్టీ క్యాబినెట్ తదితర అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేశారు. మృతి చెందిన వారి వద్ద సేకరించిన చర్మాన్ని నిల్వ ఉంచేందుకు ప్రత్యేక బాక్స్లలో ఉంచి కోల్డ్ స్టోరేజ్ రూమ్లో భద్రపరు స్తున్నారు.
పేద రోగులకు మేలు
పేదల ధర్మాసుపత్రిగా పేరుగాంచిన ఉస్మానియా దవాఖానలో స్కిన్ బ్యాంకు ఏర్పాటుతో పేద రోగులకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు అవకాశం ఉంది. స్కిన్ బ్యాంకు ఏర్పాటుకు డాక్టర్ నాగప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం మధుసూదన్ సేవలు ప్రశంసనీయమైనవి.
-డాక్టర్ బి నాగేందర్, ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్