హైదరాబాద్ : మల్టీ నేషనల్ కంపెనీల్లో(MNC) ఉద్యోగాలు ఇప్పిస్తామనని మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశామని సైబర్ క్రైం డీసీపీ కవిత(DCP Kavitha) తెలిపారు. ఓ నిందితుడు ఎరిక్సన్ గ్లోబల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(Ericsson Global India Private Limited) కంపెనీలో బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్గా(Business Intelligence Analyst) ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి పవన్ అనే వ్యక్తి వద్ద రెండున్నర లక్షల రూపాయలు వసూలు చేశాడని చెప్పారు.
డబ్బులు తీసుకొని నిందితుడు నకిలీ ఆఫర్ లెటర్ను పవన్కు పంపాడు. లెటర్ తీసుకొని ఉద్యోగం కోసం పవన్ సదరు కంపెనీకి వెళ్లగా అది నకిలీ లెటర్ అని తేలడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారని డీసీపీ తెలిపారు. ఉద్యోగాల పేరుతో మోసం చేసే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.