హైదరాబాద్ : కల్తీ వస్తువులపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతూ కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా శంషాబాద్లో(Shamshabad) గడువు ముగిసిన(Expired food) తినుబండరాలను పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..ఓ వ్యక్తి తక్కువ ధరకే తినుబండరాలను విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు.
సదరు వ్యక్తి గడువు ముగిసిన తినుబండారాలను తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి రూ.41,870 విలువైన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు(Arrest) నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా గడువు తీరిన ఆహార పదార్థాలు అమ్మిత కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చారించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.