హైదరాబాద్ : ఇన్స్ట్రాగ్రామ్(Instagram) సామాజిక మాధ్యమం ద్వారా యువతుల్ని(young women) వేధిస్తున్న(Harassing) వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్(Cybercrime) పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జిష్ణు కీర్తన్ అనే వ్యక్తి అమ్మాయి పేరుతో ఇన్స్ట్రాగ్రామ్లో రెక్వెస్టులు పంపుతున్నాడు.
అమ్మాయే అనుకొని నమ్మి పరిచయం పెరిగాక.. కొంతమంది అమ్మాయిలు తమ వ్యక్తిగత ఫొటోలు అతడికి పంపించారు. దీనిని ఆసరాగా తీసుకొని వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడుతానని బెదిస్తుండటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు పోకిరి ఆట కట్టించి కటకటాల వెనక్కి పంపారు. సోషల్ మీడియా వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.