పీర్జాదిగూడ, జనవరి3: వైద్యం వికటించి వ్యక్తి మృతి(Person died) చెందిన సంఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం కొండమడుగు గ్రామానికి చెందిన వెంకటేశ్గౌడ్ (45) ఓ ప్రవేటు పాఠశాల నిర్వహిస్తున్నాడు. భార్య వైష్ణవి, ఇద్దరు పిల్లలతో స్థానికంగా ఉంటున్నాడు.
అయితే గత నెల 30వ తేదీన వెంకటేష్కు యాక్సిడెంటై ఎముక విరగడంతో చికిత్స కోసం పీర్జాదిగూడ(Peerjadiguda)లోని శ్రీకర దవాఖానలో చేరాడు. ఆపరేషన్ చేసిన వైద్యులు మూడో రోజులు దవాఖానలో ఉంచుకుని మంగళవారం అర్ధరాత్రి సమయంలో మృతి చెందాడని తెలిపారు. దీంతో బోన్ ఫ్యాక్చరై వచ్చి మృతిచెందడంతో బంధువులు దవాఖాన ఎదుట బైటాయించారు. వైద్యల నిర్తక్ష్యం నిర్లక్ష్యం వల్లే వెంకటేష్ మృతి చెందాడని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు, పలు రాజకీయ పార్టీల నాయకులు ఆందోళన చేపట్టారు.