హైదరాబాద్ : నగరంలోని జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. విచారణకు వెళ్లిన ఇద్దరు ఎస్వోటీ కానిస్టేబుళ్లపై గుర్తు తెలియని వ్యక్తి తల్వార్తో దాడి చేశాడు. దీంతో రాజు అనే కానిస్టేబుల్కు ఛాతీలో తీవ్ర గాయాలయ్యాయి. మరో కానిస్టేబుల్ వినయ్ను తలపై కొట్టాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న ఇద్దరు కానిస్టేబుల్స్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రాజు, వినయ్ ఇద్దరూ మాదాపూర్ ఎస్వోటీ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నారు. తల్వార్తో దాడి చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు నిమగ్నమయ్యారు.