Hyderabad | వెంగళరావునగర్, ఆగస్టు 29 : కృష్ణకాంత్ పార్కులో అనుమతి లేకుండా మహిళల ఫొటోలు తీసిన వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
మధురానగర్ ఎస్ఐ ఉదయ్ కథనం ప్రకారం.. కృష్ణానగర్ నివాసి లక్ష్మణ్ ప్రైవేట్ ఉద్యోగి. యూసుఫ్గూడ కృష్ణకాంత్ పార్కులో మార్నింగ్ వాక్కు వెళుతూ, అక్కడికి వాకింగ్కు వచ్చే మహిళలు, యువతుల ఫొటోలను తన సెల్ఫోన్తో తీశాడు. గమనించిన మహిళలు మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పెట్టి కేసు నమోదు చేసి, నిందితుడిని మంగళవారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. నిందితుడికి న్యాయస్థానం మూడు రోజుల జైలు శిక్ష విధించినట్టు ఎస్ఐ తెలిపారు.