Hyderabad | హైదరాబాద్ : ఓ ఇద్దరు సాఫ్ట్వేర్ దంపతులు( Software Couples ) తమ ఇద్దరు పిల్లలను చంపి.. అనంతరం ఆత్మహత్య( Suicide ) చేసుకున్నారు. ఈ విషాద ఘటన కుషాయిగూడ పోలీసు స్టేషన్( Kushaiguda Police ) పరిధిలోని కందిగూడలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కందిగూడలోని ఓ అపార్ట్మెంట్లో సతీష్, వేద అనే ఇద్దరు దంపతులు నివాసముంటున్నారు. వీరిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఈ దంపతులకు నిషికేత్(9), నిహాల్(5) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఇద్దరు పిల్లల అనారోగ్య సమస్యలతో( Health Problems ) బాధపడుతున్నారు. పిల్లల బాధలను కళ్లారా చూడలేక దంపతులు ఈ దారుణానికి ఒడిగట్టారు.
పిల్లలకు ముందుగా పొటాషియం సైనేడ్( potassium cyanide ) ఇచ్చి, ఆ తర్వాత దంపతులిద్దరూ కూడా అదే సైనేడ్ను తీసుకున్నారు. దీంతో నలుగురు చనిపోయారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రి( Gandhi Hospital ) మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.