Manchirevula Nature Park | మణికొండ, ఫిబ్రవరి 5: రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎకో టూరిజం కార్యక్రమంలో భాగంగా మణికొండ మున్సిపాలిటీ మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో సరోజిని నాయుడు వనిత మహా విశ్వవిద్యాలయ కళాశాల(ఎనిమల్ వెల్ఫేర్ క్లబ్) విద్యార్థులు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సోమవారం ఉదయం 11 గంటల వరకు నేచర్ క్యాంప్ నిర్వహించారు.
ఎకో టూరిజం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎకో టూరిజం ప్రాజెక్ట్స్ మేనేజర్ కళ్యాణపు సుమన్ తదితరులు హాజరయ్యారు. నేచర్ క్యాంప్లో పాల్గొనాలనుకునే వారు 9493549399, 9346364583లలో సంప్రదించాలని టీఎస్ఎఫ్డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్నాయక్ కోరారు. ఈ కార్యక్రమంలో ప్లాంటేషన్ మేనేజర్ లక్ష్మారెడ్డి, శ్రీకాంత్, భాస్కర్, టీఎస్ఎఫ్డీసీ సిబ్బంది బాబు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.