ఖైరతాబాద్, మే 26 : అత్యవసర చికిత్సపై నిమ్స్ దవాఖానలోని ఆడిటోరియంలో ఆదివారం సదస్సు జరిగింది. అంతర్జాతీయ ట్రామా అండ్ క్రిటికల్ కేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప.. రోగి ప్రాణాలను రక్షించేందుకు అత్యవసర చికిత్స ఆవశ్యకత, వైద్యుల బాధ్యతలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్, ఎమర్జెన్సీ విభాగాధిపతి డాక్టర్ ఆశిమా శర్మ పాల్గొన్నారు.