Crime news: ప్రముఖుల పేర్లతో నకిలీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలు తెరచి, వారి ఫొటోలను ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న ఓ ఘరానా మోసగాడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు రాజస్థాన్కు చెందిన జుఫార్ఖాన్గా గుర్తించారు.
జుఫార్ఖాన్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలు తెరిచాడు. ఆయా ఖాతాలకు ఆయా ప్రముఖులు ఫొటోలను ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టాడు. ఆ ఖాతాల నుంచి పలువురికి డబ్బులు పంపాలంటూ మెసేజ్లు పెట్టి వసూళ్లకు పాల్పడ్డాడు. సీవీ ఆనంద్ పేరుతోనూ నిందితుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలు తెరిచాడు.