మారేడ్పల్లి : గోపాలపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఇంటర్మిడియట్ చదువుతున్న ఓ బాలిక కిడ్నాప్కు గురైన కేసు నమోదు అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…రెజిమెంటల్బజార్కు చెందిన 17 ఏళ్ల బాలిక ఇంటర్ మీడియట్ చదువుతుంది. ఈ నెల 9వ తేదీన ఇంట్లోనుంచి బయటకు వెళ్లిన ఆమె ఇంటికి తిరిగి రాలేదు.
తల్లిదండ్రులు తెలిపిన వారు, బంధువుల వద్ద వాకాబు చేసినా ఎక్కడా కనిపించలేదు. సాయంత్రం వేళ ఆ యువతి తన ఫోన్ నుంచి తల్లికి ఫోన్ చేసింది. తాను ఓ యువకుడిని ప్రేమిస్తున్నానని అతన్ని పెళ్లి చేసుకునేందుకు వెళ్తున్నానని చెప్పి పెట్టెసి అటు తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది.
దీంతో కుటుంబ సభ్యులు గురువారం గోపాలపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.