హైదరాబాద్ : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎంపీ అరవింద్ పోలీసులను ఉద్దేశించి ఈ నెల 3న తన నివాసం వద్ద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
ఎంపీ అరవింద్ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ శివచంద్ర ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఐపీసీ 294, 504, 5051(1),(b) సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.