బంజారాహిల్స్,ఫిబ్రవరి 9 : కుటుంబ కలహాల్లో భాగంగా తనను ఇంట్లోంచి వెళ్లగొట్టేందుకు ప్రయ త్నించడంతో పాటు దాడికి పాల్పడిన(Wife attack) భార్యతోపాటు బావమరుదుల మీద చర్యలు తీసుకోవాలని వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు(Case file) చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం 13లోని అంబేద్కర్నగర్ బస్తీకి చెందిన గుండప్ప(47) కూలీ పనులు చేస్తుంటాడు. భార్య లక్ష్మితో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.
దాంతో ఇంట్లోంచి వెళ్లిపోవాలని లక్ష్మి చెప్పడంతో సమీపంలోనే ఉంటున్న తన తమ్ముళ్లు గోవింద్, బాలాజీలను పిలిచింది. ఈ క్రమంలో వారి మధ్యన గొడవ చోటు చేసుకోవడంతో గోవింద్, బాలాజీలు గుండప్పపై దాడి చేశాడు. భార్య లక్ష్మి వేడివేడి స్పూన్తో ముఖంపై వాత పెట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన బాధితుడు శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.