ఖైరతాబాద్ : ఖైరతాబాద్ ఫ్లె ఓవర్పై ఓ కారు భీభత్సం సృష్టించింది. ఈ ఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఉదయం 7గంటల ప్రాంతంలో ఖైరతాబాద్ ఫ్లె ఓవర్పై టీఎస్03ఈయూ4555 నంబరుగల ఐ20 కారు వేగంగా వచ్చి ఢీవైడర్ను ఢీకొట్టింది. ఈ క్రమంలో డివైడర్పై ఉన్న పూల కుండీలు దెబ్బతిన్నాయి.
వాహనదారులు పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకుని కారును అక్కడి నుంచి తొలగించారు. కారులో నలుగురు ప్రయాణించినట్లు తెలుస్తున్నది. పోలీసులు వచ్చే సరికి అందులో ఎవరూ కనిపించలేదని చెబుతున్నారు. ప్రమాద స్థలిని పరిశీలిస్తే కారు రాంగ్ రూట్లో వచ్చి డీవైడర్ను ఢి కొట్టిందని చెబుతున్నారు. కారు నడిపిన, ప్రయాణించిన వ్యక్తుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.