ఖైరతాబాద్, ఫిబ్రవరి 4 : నేతకానీలకు ప్రభుత్వం రెండెకరాల స్థలం కేటాయించి ఆత్మగౌరవ భవనం నిర్మించాలని తెలంగాణ నేతకాని మహార్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేశ్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శనివారం సంఘం నూతన కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాజేశ్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ తమ సామాజికవర్గానికి చెందిన ఎంపీ బోర్లకుంట వెంకటేశ్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలకు రాజకీయంగా అవకాశం కల్పించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 20 లక్షలకు పైగా నేతకాని జనాభా ఉంటారని, నేటికీ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడ్డారని తెలిపారు. ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలన్నారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి నరేశ్, ఉపాధ్యక్షులు అశోక్, రాజేశ్, ప్రకాశ్, గంగన్న, మహిళా అధ్యక్షురాలిగా సోంబాయి, స్టీరింగ్ కమిటీ చైర్మన్ నర్సయ్య, పొలిట్ బ్యూరో చైర్మన్ రాజేశ్, యువజన అధ్యక్షుడు రాజ్కుమార్ పాల్గొన్నారు.