సిటీబ్యూరో, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): కరెంట్ బిల్లు కట్టలేదు.. సాయంత్రం వరకు బిల్లు కట్టకపోతే ఇంటికి పవర్ కట్ అవుతుందంటూ వచ్చిన ఒక మేసేజ్కు స్పందించిన వ్యాపారి బ్యాంకు ఖాతా నుంచి సైబర్నేరగాళ్లు రూ.7 లక్షలు కాజేశారు. అమీర్పేట్కు చెందిన బాధితుడి సెల్ఫోన్కు మేసేజ్ రావడంతో, అందులో ఉన్న ఫోన్ నంబర్కు కాల్ చేశాడు. సైబర్నేరగాళ్లు వెంటనే ఎనీడెస్క్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలంటూ బాధితుడికి సూచించగా.. అతడు యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు. బ్యాంకు ఖాతా నుంచి రూ. 5 పంపించాలని నేరగాళ్ల సూచించడంతో.. బాధితుడు అలాగే చేశాడు. ఎనీడెస్క్ యాప్ ద్వారా బ్యాంకు ఖాతా వివరాలు సేకరించిన సైబర్నేరగాళ్లు.. బాధితుడి ఖాతాలో ఉన్న రూ. 7 లక్షలు కాజేశారు.
తార్నాకకు చెందిన మరో బాధితుడు మ్యాక్స్లైఫ్ ఇన్సూరెన్స్లో పాలసీ తీసుకున్నాడు. 2014 నుంచి పాలసీ ప్రీమియం చెల్లించడం లేదు. కాగా, సైబర్నేరగాళ్లు ఫోన్ చేసి, తాము మ్యాక్స్లైఫ్ నుంచి మాట్లాడుతున్నామంటూ నమ్మించారు. మీరు రూ. 7 లక్షలు పెండింగ్ ప్రిమియం చెల్లిస్తే, రూ. 32 లక్షలు వస్తాయంటూ నమ్మించారు. సైబర్నేరగాళ్ల మాటలు నమ్మిన బాధితుడు రూ. 7 లక్షలు చెల్లించాడు. ఆ తర్వాత నేరగాళ్లు ఫోన్ స్వీచ్ఛాఫ్ చేశారు. బాధితులు సీసీఎస్ సైబర్క్రైమ్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.