బన్సీలాల్పేట్/బేగంపేట్, జనవరి 18: ‘కంటి వెలుగు’శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, కంటి సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా హాజరై వైద్యులను సంప్రదించాలని బీఆర్ఎస్ నాయకులు బుధవారం బన్సీలాల్పేట్లో ఇంటింటికి వెళ్ళి ఆహ్వానం అందించారు. న్యూబోయిగూడ ఆరోగ్య కేంద్రంలోని ఆశ వర్కర్లతో కలిసి బీఆర్ఎస్ నాయకులు బీ.జ్ఞాని, బి.శ్రీనివాస్, డి.అశోక్, మోహన్లతో పాటు ఆశ వర్కర్లు పాల్గొన్నారు. న్యూబోయిగూడలోని కీస్ బ్లాక్స్ కమ్యూనిటీ హాల్లో కంటి వెలుగు శిబిరం గురువారం నుంచి 15 రోజుల పాటు కొనసాగుతుందని వారు తెలిపారు.
నేటి నుంచే ఉచిత కంటి పరీక్షలు
బేగంపేట్ సర్కిల్ పరిధిలో గురువారం నుంచి కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం అవుతుందని బేగంపేట్ సర్కిల్ ఉప కమిషనర్ ముకుందరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయం త్రం 4 గంటల వరకు ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకోవచ్చునని చెప్పారు. స్థానిక ప్రజలంతా ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
జీహెచ్ఎంసీ బేగంపేట్ సర్కిల్ పరిధిలో ఏడు కేంద్రాలలో ‘కంటి వెలుగు’శిబిరాలను ఏర్పాటు చేశామని ముకుందరెడ్డి తెలిపారు. బన్సీలాల్పేట్ డివిజన్ పరిధిలో 1).హమాలిబస్తీలోని బస్తీ దవాఖాన, 2). న్యూబోయిగూడలోని కీస్ బ్లాక్స్ కమ్యూనిటీ హాలు. రాంగోపాల్పేట్ డివిజన్ పరిధిలో 3). విక్టోరియా రాణిగంజ్ కమ్యూనిటీ హాలు, బేగంపేట్ డివిజన్ పరిధిలో 5). మోడల్ మార్కెట్ పాటిగడ్డ, 6). ఓల్డ్ కస్టమ్స్ బస్తీ కమ్యూనిటీ హాల్, మోండామార్కెట్ డివిజన్ పరిధిలో 7). నాలాబజార్ డొక్కాలమ్మ ఆలయం కమ్యూనిటీ హాలులో ఈ శిబిరాలను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.