సికింద్రాబాద్, జనవరి10 : ప్రజాపాలనలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును ఆన్లైన్లో ఎంట్రీ చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ వెల్లడించారు. బుధవారం సాయంత్రం సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో బేగంపేట, సికింద్రాబాద్ సరిళ్లకు సంబంధించిన దరఖాస్తుల డేటా ఎంట్రీ సెంటర్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఒకొక దరఖాస్తు డేటా ఎంట్రీ చేయడానికి ఎంత సమయం పడుతుందని అడిగారు. కుటుంబ సభ్యులు ఎకువ ఉన్న దరఖాస్తులు నమోదు చేయడానికి 10 నుంచి 15 నిమిషాల వరకు పడుతుందని వివరించారు. 8 గంటల షిఫ్ట్ సమయంలో 70 నుండి 80 దరఖాస్తులను డేటా ఎంట్రీ చేస్తున్నట్లు ఆపరేటర్లు కమిషనర్కు వివరించారు.
అనంతరం కమిషనర్ రొనాల్డ్రాస్ మాట్లాడుతూ ప్రజాపాలనలో గ్రేటర్లో మొత్తం 24 లక్షల 74 వేల 325 దరఖాస్తులు స్వీకరించామన్నారు. అందులో అభయహస్తం అప్లికేషన్లు 19 లక్షలకుపైగా ఉండగా, మిగతా 5.73 లక్షల అప్లికేషన్లు రేషన్ కార్డు, ఇతర సమస్యలపై వచ్చినట్లు కమిషనర్ వివరించారు. అందులో ఇప్పటి వరకు 7 లక్షల అప్లికేషన్లు డేటా ఎంట్రీ పూర్తయినట్లు తెలిపారు. మొత్తం 635 డేటా సెంటర్ లను ఏర్పాటు చేసి 5000 మందితో డేటా ఎంట్రీ చేస్తున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు సుమారు 300 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. పైవేట్ ఏజెన్సీలు కంప్యూటర్లు, డేటా, కంప్యూటర్ ఆపరేటర్లలను మాత్రమే సమకూరుస్తాయని, జీహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణలో మాత్రమే డేటా ఎంట్రీ జరుగుతుందన్నారు.
హయత్ నగర్ సరిల్కు సంబంధించిన ఏజెన్సీ వారు వేరే చోట ఉన్న సెంటర్కు తరలించే క్రమంలో రోడ్డుపై పడిపోయాయని, స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్ పాటించని టీమ్ లీడర్పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కుత్బుల్లాపూర్ వార్డు కార్యాలయంలో దరఖాస్తులను ఇంటికి తీసుకుని వెళుతున్నారనే ఆరోపణలపై టీమ్ లీడర్కు షోకాజ్ నోటీసు ఇచ్చామన్నారు. ఎవరూ ఎలాంటి ఆందోళన చెందవద్దని దరఖాస్తులు అన్నీ ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవికిరణ్, సికింద్రాబాద్, బేగంపేట్ డిప్యూటీ కమిషనర్లు శంకర్, సుదాంష్ పాల్గొన్నారు.