Hyderabad | సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లిలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అభివృద్ధి చేసిన లేఅవుట్లో విక్రయానికి ఉంచిన అన్ని ప్లాట్లు హాట్కేకుల్లా అమ్ముడయ్యాయి.
55 ఎకరాల లేఅవుట్లో మొదటి విడతతో 50 ప్లాట్ల (15000 చదరపు అడుగుల విస్తీర్ణం)ను విక్రయానికి ఉంచ గా, సోమవారం ఉదయం 25 ప్లాట్లు, సాయం త్రం 25 ప్లాట్లు విక్రయించారు. వీటి ద్వారా హెచ్ఎండీఏకు మొత్తం రూ.88.09 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో గజం ధర అత్యధికంగా రూ.63వేలు, అత్యల్పంగా రూ.55 వేలు పలికిందని, సగటున రూ.58,730లుగా పలికిందని అధికారులు తెలిపారు.