మహేశ్వరం, నవంబర్ 8: సబ్బండ వర్గాల ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని.. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే నని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం మహేశ్వరం, గొల్లూరు గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి 50 మంది మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహేశ్వరం నియోజకవర్గంలో జరుగుతున్న పనులు చూసి ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. గ్రామ స్వరాజ్యమే బీఆర్ఎస్ పార్టీ ధ్యేయమని తెలిపారు.
కరెంటు కష్టాలు, స్కాంల కాంగ్రెస్ కావాలా, సంక్షేమం అందించే బీఆర్ఎస్ పార్టీ కావాలా ప్రజలు ఆలోచించుకోవాలని తెలిపారు. తెలంగాణలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా మారుతుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారు నరేశ్, మహేశ్, కన్నయ్య, ఆనంద్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మినాజ్ పటేల్, శివగంగ దేవాలయ చైర్మన్ నిమ్మగూడెం సుధీర్గౌడ్, కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఆదిల్ అలీ, నవీన్, గ్రామ శాఖ అధ్యక్షుడు దుడ్డు కృష్ణ, గొల్లూరు సర్పంచ్ మంద కవిత కుమార్, ఎస్కే ఆజాం మహేశ్వరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం
బీఆర్ఎస్తోనే నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమని జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి తెలిపారు. బుధవారం మహేశ్వరం, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో ఇంటింటికి బీఆర్ఎస్ ప్రచారంలో భాగంగా పీఏసీఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్తో కలిసి ప్రజలను కలిసి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక చొరవతో మహేశ్వరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా ప్రతి గడపకు అందుతున్నాయని అన్నారు. తెలంగాణలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు.
ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారని తెలిపారు. నియోజకవర్గంలో మంత్రి చేస్తున్న అభివృద్ధి పనులే ఆమె గెలుపునకు బాటలు పడుతున్నాయని అన్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆనందం, ఎంపీటీసీ నడికూడి రమేశ్, పీఏసీఎస్ డైరెక్టర్ పొల్కం బాలయ్య, నియోజకవర్గం కార్యదర్శి గుండెమోని అంజయ్య ముదిరాజ్, కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఆదిల్ అలీ, ఎంపీటీసీ కుమారి రాయప్ప, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కల యాదగిరిగౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు దుడ్డు కృష్ణయాదవ్, నాయకులు నవీన్, కరోళ్ల రాజేశ్, బాల్రాజ్, హాజీబాబ, వెంకటేశ్, సంజీవ, రవీందర్నాయక్, ఎస్కే ఆజాం తదితరులు పాల్గొన్నారు.