హైదరాబాద్ : హైదరాబాద్లో రూ. 5.50 కోట్ల విలువైన డ్రగ్స్ను సీజ్ చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ మీడియాకు వెల్లడించారు. 14.2 కిలోల సూడో ఎపిడ్రిన్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ డ్రగ్స్ను కలిగి ఉన్న ముగ్గురిని అరెస్టు చేశామన్నారు.
డీఆర్ఐ సమాచారంతో బేగంపేటలోని ఇంటర్నేషనల్ పార్శిల్ కేంద్రంలో తనిఖీలు చేసి, మాదకద్రవ్యాలను సీజ్ చేసినట్లు సీపీ చెప్పారు. డ్రగ్స్ను హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు పంపించేందుకు అనుమానం రాకుండా ఫోటో ఫ్రేమ్స్లలో పెట్టి ప్యాకింగ్ చేశారని పేర్కొన్నారు.