Heroin Seized | శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ను కస్టమ్స్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయంలో తనిఖీలు చేస్తున్న సమయంలో జాంబియా నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి భారీగా మత్తు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహిళ హ్యాండ్ బ్యాగ్తో పాటు సూట్ కేస్ , డాక్యుమెంట్ ఫోల్డర్లో డ్రగ్స్ దాచిపెట్టి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తూ అధికారులకు చిక్కింది. ప్రయాణికురాలిని దక్షిణ ఆఫ్రికా వాసిగా గుర్తించారు. నిందితురాలి నుంచి 5.93 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఆ తర్వాత నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ మార్కెట్లో రూ.41కోట్ల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.