హైదరాబాద్: నగరంలోని హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ (Old MLA quarters) వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద సైకిల్ను తప్పించబోయిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను గాంధీ దవాఖానకు తరలించారు. గాయపడినవారంతా ఇంజినీరింగ్ విద్యార్థులని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తారు. విద్యార్థుల వివరాలు తెలియాల్సి ఉన్నది.