హైదరాబాద్: హైదరాబాద్తోపాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో జంట జలాశయాలకు వరద పోటిత్తింది. ఇప్పటికే నిండు కుండల్లా ఉండటంతో అధికారులు హిమాయత్ సాగర్ (Himayat Sagar), ఉస్మాన్ సాగర్ (Osman sagar) గేట్లను (Gates) ఎత్తివేశారు. హిమాయత్ సాగర్లో నాలుగు గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే కిందికి వదిలేస్తున్నారు. హిమాయత్ సాగర్లో ప్రస్తుతం 1764 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. ఇక ఉస్మాన్ సాగర్ జలాశయంలో రెండు గేట్లను ఎత్తివేశారు. దీంతో మూసీ నదిలోకి భారీగా వరద నీరు వస్తున్నది.
ఈనేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జలమండలి అధికారులు అప్రమత్తం చేశారు. చాదర్ఘాట్లో లోయర్ బ్రిడ్జి సమీపంలో ఉన్న కాలనీ వాసులను ఇండ్లు ఖాళీ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా మూసారం బ్రిడ్జి వద్ద వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.