సిటీబ్యూరో, జూలై 28(నమస్తే తెలంగాణ): ఎగువన కురిసిన భారీ వర్షాలకు జంట జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. రెండు జలాశయాలకు 3,500 క్యూసెక్కుల వరకు వరద వస్తుండగా… అధికారులు రెండు చొప్పున గేట్లు ఎత్తి దిగువకు 3,600 క్యూసెక్కుల వరకు వదులుతున్నారు. హిమాయత్సాగర్కు వరద పరిమాణం బాగానే ఉన్నా గండిపేటకు స్వల్పంగానే ఉంది. మరోవైపు మూసీలో వరద ఉధృతి పెరిగింది.
గురువారం మూసారంబాగ్ బ్రిడ్జికి తాకుతూ వెళ్లిన వరద శుక్రవారం తగ్గింది. దీంతో మూసీ పరీవాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలు, మురికివాడలూ వరద ముంపు నుంచి తేరుకునే అవకాశాలు ఉన్నాయని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు.