సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ) : నగరంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడం, విద్యాసంస్థలకు సెలవులు కావడంతో దక్షిణ మధ్య రైల్వే ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు 34 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసింది. లింగంపల్లి-హైదరాబాద్ మధ్య 18, ఫలక్నుమా-లింగంపల్లి 14, సికింద్రాబాద్-లింగంపల్లి 2 సర్వీసుల చొప్పున రద్దయ్యాయి.
వీక్లీ రైళ్ల పొడిగింపు
తిరుపతి, అకో లా, పుణె స్టేషన్ల మధ్య నడుస్తు న్న వారాంతపు ప్రత్యేక రైళ్ల రాకపోకలను ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు బుధవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు. తిరుపతికి వెళ్లే ప్రయాణికులు అధిక సంఖ్యలో ఉండ డం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సికింద్రాబాద్, మేడ్చల్, బొల్లారం తదితర స్టేషన్ల మధ్య నడిచే 15 రైళ్ల రాకపోకలను ఈ నెల 14 నుంచి 17 వరకు రద్దు చేసినట్లు వివరించారు.