మణికొండ, నవంబర్ 11: రాజేంద్రనగర్ నియోజకవర్గం నార్సింగి మున్సిపాలిటీ గండిపేట్లో కాంగ్రెస్ మైనార్టీ విభాగానికి చెందిన సుమారు 300 మంది మైనార్టీ నాయకులు స్థానిక కౌన్సిలర్లు గోపాల సునీత, విజిత ప్రశాంత్ యాదవ్ల నేతృత్వంలో శనివారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ గులాబీ కండువాలు కప్పి వారిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, రానున్న ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో మరోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని ప్రకాశ్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన అభ్యర్థులు కేవలం డమ్మీలుగానే మిగులుతారని, వారికి ప్రజల్లో ఆదరణ లేదన్నారు. రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ సర్కార్ అఖండమైన మెజార్టీతో అధికారం చేపట్టడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో నార్సింగి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్, మాజీ ఎంపీపీ తలారి మల్లేష్ ముదిరాజ్, నార్సింగి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పి.చంద్రశేఖర్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆర్.నర్సింహ, సింగిల్ విండో చైర్మన్ తోలుకట్టే కృష్ణ, వైస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ప్రశాంత్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు గోపాల గణేష్ కుమార్, పొన్న రమేష్, మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.