హైదరాబాద్ పరిధిలోని రెండు పోలీస్ స్టేషన్లలో కరోనా కలకలం రేపింది. రాజేంద్ర నగర్, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో 30 మంది సిబ్బందికి కరోనా సోకింది. రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో ఎస్సై, ఏఎస్సైతో పాటు 14 మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మరోవైపు జీడిమెట్లలో ఎస్సైతో పాటు నలుగురు కానిస్టేబుళ్లకు కొవిడ్-19 నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన పోలీసు అధికారులు.. ఫిర్యాదుదారులకు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. మాస్కు లేకుండా ఎవర్నీ పీఎస్ల్లోకి అనుమతించడం లేదు. ఫిర్యాదుదారుడు ఒక్కరే పోలీస్ స్టేషన్లోకి రావాలని ఆంక్షలు విధించారు. శానిటైజ్ చేసుకున్న తర్వాతే స్టేషన్లోకి రావాలని సూచిస్తున్నారు.