హైదరాబాద్ : పాతబస్తీలో బైక్లను చోరీ చేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. రెండేండ్లుగా చోరీలు చేస్తున్న ముగ్గురు దొంగలను చాంద్రాయణగుట్ట పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. 53 బైక్లను పోలీసులు సీజ్ చేశారు. అయితే ఫైనాన్సియర్లు సీజ్ చేసిన వాహనాలంటూ షాద్నగర్, కేశంపేట్లో బైక్లను నిందితులు విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు, నిందితులను రిమాండ్కు తరలించారు.