హైదరాబాద్ : బ్యాంకు అధికారులమంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ, ఉజ్జయినిలోని రెండు కాల్ సెంటర్లపై దాడులు చేసి 16 మందిని అరెస్టు చేశారు. అక్కడి పోలీసుల సాయంతో నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
ఆర్బీఎల్ బ్యాంకు అధికారులమంటూ పలువురు ఖాతాల నుంచి రూ. 3 కోట్లను కాజేసినట్టు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఢిల్లీ, ఉజ్జయిని వెళ్లిన పోలీసు ప్రత్యేక బృందం.. అక్కడి కాల్ సెంటర్పై దాడి చేసింది. 16 మందిని అదుపులోకి తీసుకోగా మరో ఏడుగురు పరారీ అయ్యారు. నిందితుల నుంచి ల్యాప్టాప్లు, సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.