హైదరాబాద్ : హైదరాబాద్లోని గాంధీ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో భారీగా హవాలా నగదు పట్టుబడింది. ట్యాంక్బండ్కు సమీపంలోని హోటర్ మారియట్ వద్ద రూ. 3.5 కోట్ల హవాలా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారీగా హవాలా నగదును తరలిస్తున్నట్లు నార్త్ జోన్ టాస్క్ఫోర్స్, గాంధీనగర్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో మారియట్ హోటల్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
గండి సాయికుమార్ రెడ్డికి వెంకటేశ్వర్ అనే వ్యక్తి రూ. 3.5 కోట్ల నగదు ఇచ్చాడు. ఆ నగదును సైదాబాద్లో ఉండే బాలు, మహేందర్కు ఇవ్వాలని సూచించాడు. ఇదే సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించి, రూ. 3.5 కోట్ల నగదుతో పాటు 7 సెల్ఫోన్లు, రెండు కార్లను సీజ్ చేశారు. గండి సాయికుమార్ రెడ్డి, గుండే మహేశ్, సందీప్ కుమార్, మహేందర్, అనూష్ రెడ్డి, భరత్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నగదుకు సంబంధించిన సమాచారాన్ని వారు సరిగా చెప్పకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.