జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 19 : నుమాయిష్లో మహిళల భద్రతకు హైదరాబాద్ షీ టీమ్స్ విభాగం ఆధ్వర్యంలో పటిష్ట చర్యలు తీసుకున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 49 రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనను 24 లక్షల మంది సందర్శించగా అందులో మహిళలే ఎక్కువగా ఉన్నారు.
ఆదివారంతో ముగిసిన ఈ ప్రదర్శనలో షీ టీమ్స్ వివిధ కేసుల్లో 117 మందిని అదుపులోకి తీసుకుని పరివర్తన దిశగా చర్యలు తీసుకున్నారు. ఇందులో 41 మందికి 2 రోజుల జైలు శిక్ష.. రూ.250/- జరిమానా, 10 మందికి 3 రోజుల జైలు శిక్ష.. రూ.250 జరిమానా, నలుగురికి 4 రోజుల జైలు శిక్ష.. రూ.250 జరిమానా, ఒక నేరస్తుడికి రూ.250 జరిమానా విధించినట్లు ఉమెన్ సేఫ్టీ డీసీపీ కవిత తెలిపారు.