MMTS | హైదరాబాద్ : హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో నడుస్తున్న 22 ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను ఈ నెల 14 నుంచి 20 వరకు రద్దు చేసినట్లు శనివారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు. లింగంపల్లి-హైదరాబాద్, ఉందానగర్ – లింగంపల్లి, ఫలక్నుమా – లింగంపల్లి, రామచంద్రాపురం – ఫలక్నుమా స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్లు రద్దు చేశామన్నారు. అయితే ఆయా రైలు మార్గాల్లో మౌలిక వసతి సదుపాయాల అభివృద్ధి పనుల వల్ల ఈ సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఎంఎంటీఎస్ ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.