Trains cancelled | హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో నడుస్తున్న 22 ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను ఈ నెల 14 నుంచి 20 వరకు రద్దు చేసినట్లు శనివారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు.
లింగంపల్లి-హైదరాబాద్, ఉందానగర్-లింగంపల్లి, ఫలక్నుమా-లింగంపల్లి, రామచంద్రాపురం-ఫలక్నుమా వంటి స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్లు రద్దు చేశామన్నారు. అయితే ఆయా మార్గంలో మౌలిక వసతి సదుపాయాల అభివృద్ధి పనుల వల్ల ఈ సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.